SOURCE :- TELUGU ONE
తను నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం విజయాలు కలిగిన హీరో వెంకటేష్(venkatesh)అందుకే ఆయన పేరు ముందు విక్టరీ వచ్చి చేరింది.వెంకటేష్ సినిమా వస్తుందంటే చాలు ఫ్యామిలీ మొత్తం కలిసి ఆ సినిమాకి వెళ్ళడం అనే ఆనవాయితీ ఎప్పటినుంచో వస్తుంది. తాజాగా ఆయన మూవీకి సంబంధించిన న్యూస్ ఒకటి ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులోను ఆనందాన్ని నింపుతుంది.
విక్టరీ వెంకటేష్ మొన్న సంక్రాంతికి సైంధవ్ (saindhav)తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన సైంధవ్లోని వెంకటేష్ నటనకి మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఒక ప్రాణాంతకరమైన వ్యాధితో పోరాడుతున్న తన కూతురి ఆరోగ్యం బాగుపడటానికి కావాల్సిన డబ్బుల కోసం సైంధవ్ కోనేరు (వెంకటేష్) అలియాస్ సైకో చీకటి సామ్రాజ్యంలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత సైకో కి కొన్ని కఠినమైన పరిస్థితులు ఎదురవుతాయి. అంతకుముందే సైకో కి చీకటి సామ్రాజ్యంలో కొంత మంది శత్రువులు ఉంటారు. ఈ క్రమంలో ఎన్నో కఠినమైన పరిస్థితులని ఎదుర్కొని సైకో తన కూతురిని కాపాడుకోవడానికి చేసే పోరాటం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.
శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకట్ బోయినపల్లి నిర్మాతగా నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించిన సైంధవ్ లో వెంకటేష్ తో పాటు శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, ఆండ్రియా జెర్మియా ప్రధాన పాత్రల్లో నటించారు. భారతదేశం సహా ప్రపంచవ్యాప్తంగా 240 దేశాలు, ప్రాదేశిక ప్రాంతాల్లో ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం తెలుగుతో పాటు తమిళ్ లోను ఫిబ్రవరి 3 న అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రసారం కానుంది.
SOURCE : TELUGU ONE