SOURCE :- TELUGU ONE
దాదాపుగా ఇండియాలో ఉన్న అన్ని లాంగ్వేజ్ ల్లోను సినిమాలు తెరకెక్కుతుంటాయి.ఆయా భాషలకి చెందిన హీరోలని అక్కడి ప్రేక్షకులు అభిమానిస్తుంటారు. కానీ కాలం మారే కొద్దీ పాన్ ఇండియా ప్రేక్షకులు పుట్టుకొచ్చారు. అసలు ఇప్పుడు మనం చెప్పుకుంటున్న పాన్ ఇండియా మూవీ పుట్టిందే పాన్ ఇండియా ప్రేక్షకుల కోసం.ఎందుకంటే ఎన్నో ఏళ్ళ క్రితం నుంచే ఇతర భాషలకి చెందిన హీరోలకి వేరే భాషకి చెందిన ప్రేక్షకుల్లో అభిమానులు ఉన్నారు. గతంలో కూడా పాన్ ఇండియా సినిమాలు వచ్చాయి.కాకపోతే వాటి ఉధృతి ఇప్పుడు ఎక్కువయ్యింది. తాజాగా ఇద్దరు బడా ప్రొడ్యూసర్స్ కి చెందిన న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
మైత్రి మూవీ మేకర్స్ అండ్ డివివి ఎంటర్ టైన్మెంట్స్ ఈ రెండు నిర్మాణ సంస్థలకి తెలుగు నాట మంచి పేరు ఉంది.ఇప్పుడు ఈ రెండు సంస్థలు తమిళ అగ్ర హీరోలైన అజిత్, విజయ్ లతో సినిమాకి ప్లాన్ చేస్తున్నారనే వార్త లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ అజిత్ తోను డివివి ఎంటర్ టైన్మెంట్స్ విజయ్ తోను సినిమా చెయ్యబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. గతంలోనే అజిత్ మైత్రి కాంబో ఉందనే విషయం బయటకి వచ్చింది.
పుష్ప, ఆర్ఆర్ఆర్ వంటి భారీ సినిమాలని పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ చేసి ఆ రెండు సంస్థలు మంచి పేరు సంపాదించాయి. కాకపోతే తెలుగు హీరోలతో తెరకెక్కింది ఆ సినిమాలని ఇతర భాషల్లో రిలీజ్ చేసారు. అలాంటిది ఇప్పుడు డైరెక్టుగా తమిళ హీరోలైన విజయ్, అజిత్ తో సినిమాలు చేస్తుండటం సంచలనమే అవుతుంది. పైగా తెలుగు లో పురుపోసుకున్న ఆ సంస్థలు తమిళంలో డైరెక్ట్ గా సినిమాలు నిర్మించడం ఇదే ఫస్ట్ టైం.
SOURCE : TELUGU ONE