SOURCE :- ONE INDIANEWS
India
oi-Mallikarjuna
ఎన్నో
ఏళ్లుగా
బెంగళూరుకు
దూరంగా
ఉన్న
కర్ణాటక
ఇండస్ట్రియల్
ఏరియా
డెవలప్మెంట్
బోర్డు
(కేఐఏడీబీ)
మళ్లీ
బెంగళూరులో
తెరమీదకు
వచ్చింది.
బెంగళూరు
సిటీ
సమీపంలోని
బెంగళూరు
గ్రామీణ
జిల్లా
పరిధిలోని
సర్జాపూర్
చుట్టూ
భారీ
పారిశ్రామిక
పార్కు
ఏర్పాటు
చేయాలని
నిర్ణయించారు.
తమిళనాడు
రాష్ట్రం
సరిహద్దులోనే
వందల
ఎకరాల్లో
ఇండస్ట్రియల్
పార్క్
ఏర్పాటుకు
పనులు
చకచకా
జరుగుతున్నాయని
సమాచారం.
డెక్కన్
హెరాల్డ్
నివేదించిన
ప్రకారం
తమిళనాడు
సరిహద్దులోని
బెంగళూరు
గ్రామీణ
జిల్లాలో
647
ఎకరాల
విస్తీర్ణంలో
పారిశ్రామిక
పార్క్
రానుంది.
బెంగుళూరుపై
ఇప్పటికే
అన్ని
రకాలుగా
తీవ్ర
ఒత్తిడి
నెలకొనింది.
కొత్త
పారిశ్రామిక
స్థాపనపై
వ్యతిరేకత
వచ్చే
అవకాశం
ఉందని
సమాచారం.
ఫిబ్రవరి
20వ
తేదీన
జరిగిన
చివరి
బోర్డు
సమావేశంలో
అత్తిబెలె-
సర్జాపూర్
మధ్య
ఉన్న
ఆరు
గ్రామాల్లో
పారిశ్రామిక
పార్కు
ఏర్పాటు
ప్రతిపాదనకు
కేఐఏడీబీ
అమోదం
తెలిపిందని
డెక్టన్
హెరాల్డ్
నివేదిక
తెలిపింది.
బెంగళూరులో
తమ
వ్యాపారాలను
ఏర్పాటు
చేసేందుకు
పరిశ్రమల
నుంచి
డిమాండ్
ఎక్కువగా
ఉండటంతో
ఈ
నిర్ణయం
తీసుకున్నట్లు
సమాచారం.
ఈ
గ్రామాల్లో
భూసేకరణ
అధికారులు
సిద్దం
అవుతున్నారు.
అనేకల్
తాలూకాలోని
సర్జాపుర
సమీపంలోని
బిక్కనహళ్లి,
ఎస్
మేడహళ్లి,
అడిగర
కల్లహళ్లి,
సొళ్లేపుర,
ముత్తా
నల్లూరు,
అమనికెరె,
హందేనహళ్లి
చెరువులు
ఈ
పారిశ్రామిక
పార్కు
పరిధిలోకి
రానున్నాయి.
చంపేస్తామని
బెదిరిస్తున్నారు,
మంత్రి
సంచలన
వ్యాఖ్యలు,
ఇది
వాళ్లపనే
అని
నాకు
తెలుసు!
బోర్డు
ఆమోదం
పొందిన
ఒక
నెల
తర్వాత
కేఐఏడీబీ
ఈ
ఆస్తులను
స్వాధీనం
చేసుకోవడానికి
ప్రాథమిక
నోటిఫికేషన్ను
జారీ
చేసినట్లు
తెలిసింది.
పారిశ్రామిక
ప్రాంతాల్లో
దళిత
పారిశ్రామికవేత్తలకు
రిజర్వ్డ్
భూముల
పెంపు
ఉండటం
వలన
బెంగళూరులో
పరిశ్రమలు
స్థాపించాలని
పారిశ్రామికవేత్తల
నుంచి
విపరీతమైన
డిమాండ్
ఉందని,
అయితే
తగినంత
భూమి
అందుబాటులో
లేదని
కేఐఏడీబీ
సమావేశంలో
పేర్కొంది.
బొమ్మసంద్ర,
జిగణి,
దొమ్మసంద్ర
లింక్
రోడ్డు,
అత్తిబెలె,
వీరసంద్ర,
ఎలక్ట్రానిక్స్
సిటీ
వంటి
పారిశ్రామిక
పార్కులు
స్థలం
కొరత
ఉన్న
చోట
3,
316
ఎకరాల్లో
విస్తరించి
ఉన్నాయని
పేర్కొంది.
బోర్డు
సమావేశంలో
కేఐఏడీబీ
ప్రత్యేక
భూసేకరణ
అధికారి
నివేదిక
పారిశ్రామిక
పార్కుల
ఏర్పాటుకు
గ్రామాలను
అత్యంత
అనువైనదిగా
గుర్తించింది,
చాలా
భూమి
వ్యవసాయం
చేస్తున్నారని,
కొంత
వరకు
ఖాళీ
అని
పేర్కొంది.
ఈ
ప్రాంతంలో
పెద్దగా
అభివృద్ధి
జరగడం
లేదని,
ఈ
ప్రాంతానికి
5
కి.మీ
దూరంలో
జాతీయ
రహదారి
ఉందని
నివేదిక
పేర్కొంది.
ఫెడరేషన్
ఆఫ్
కర్ణాటక
ఛాంబర్స్
ఆఫ్
కామర్స్
అండ్
ఇండస్ట్రీ
(ఎఫ్
కేసీసీఐ)
ప్రతిపాదనను
స్వాగతించింది.
బెంగళూరులోని
హార్డ్వేర్
పార్క్
బెంగళూరులో
కేఐఏడీబీ
చివరిసారిగా
అభివృద్ధి
చేసిన
పారిశ్రామిక
పట్టణం.
ఛాంబర్
ప్రెసిడెంట్
రమేష్
చంద్ర
లాహోటి
మాట్లాడుతూ
రోడ్లు,
గ్రిడ్
విద్యుత్,
నీరు
సహా
అన్ని
సౌకర్యాలు
అందుబాటులో
ఉంటే
ఇలాంటి
పారిశ్రామిక
టౌన్షిప్లు
మరిన్ని
రావాల్సిన
అవసరం
ఉందని
అన్నారని
నివేదిక
తెలిపింది.
షా
ఓ
గూండా,
రౌడీ,
అయినా
పక్కనే
పెట్టుకున్న
ప్రధాని
మోదీ,
సీఎం
కొడుకు
సంచలన!
2014
చట్టం
ప్రకారం
రైతులకు
మార్కెట్
ధర
ప్రకారం
పరిహారం
అందజేస్తామని
కేఐఏడీబీ
సీనియర్
అధికారి
ఒకరు
తెలిపారు.
గైడెన్స్
విలువ
కంటే
పరిహారం
రెండు
నుంచి
నాలుగు
రెట్లు
ఎక్కువగా
ఉన్నందున,
సాధారణంగా
భూమి
కోల్పోయిన
వారి
నుండి
ఎటువంటి
ప్రతిఘటన
ఉండదని
ఆయన
అంటున్నారు.
బెంగళూరు
నగరం
ఇప్పటికే
నీటి
కోరతతో
తహతహలాడుతోంది.
బెంగళూరు
ట్రాఫిక్
సమస్య
ఇప్పటికే
నగరవాసులను
ఉక్కిరిబిక్కిరి
చేసింది.
ముందుగా
ఏర్పాటు
చేసిన
పారిశ్రామిక
ప్రాంతాలకు
సరైన
మౌలిక
సదుపాయాలు
కల్పిస్తే
సరిపోతుందని,
కొత్తగా
పారిశ్రామిక
పార్క్
లు
అవసరం
లేదని,
బెంగళూరు
నగరంపై
ఎందుకు
ఒత్తిడి
తీసుకురావాలనే
అభిప్రాయాలు
కూడా
వినిపిస్తున్నాయి.
మొత్తం
మీద
బెంగళూరు
గ్రామీణ
జిల్లాలో
కొత్త
పారిశ్రామిక
పార్క్
వివాదాలకు
దారితీస్తుందా
?,
లేక
రైతులు
స్వచ్చందంగా
భూములు
ఇస్తారా
?
అని
వేచిచూడాలి
అని
బెంగళూరు
ప్రజలు
అంటున్నారు.
English summary
They are trying to establish an industrial hub on 647 acres in Bengaluru rural district. KIADB is collecting land in villages near Sarjapura.
Story first published: Thursday, March 28, 2024, 22:38 [IST]
SOURCE :- ONE INDIA