Home వినోదం entertainment telgu చిరంజీవికి చెమటలు పట్టించింది.. మరి బాలకృష్ణకి 

చిరంజీవికి చెమటలు పట్టించింది.. మరి బాలకృష్ణకి 

1
0

SOURCE :- TELUGU ONE

హ్యాట్రిక్ విజయాలతో మంచి ఊపు మీద ఉన్న బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని బాబీ దర్శకత్వంలో చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.ఈ మూవీ బాలయ్య ఖాతాలో మరో రికార్డు మూవీగా నిలిచిపోతుందని ఫ్యాన్స్ చాలా గట్టి నమ్మకంతో ఉన్నారు. డైరెక్టర్ బాబీ కూడా ఇంతకు ముందెప్పుడు చూడని కొత్త బాలయ్యని చూస్తారని చెప్పడంతో సినిమా మీద అందరిలోను మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి.ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ మూవీకి సంబంధించిన తాజా న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది 

 చిరంజీవితో కలిసి వాల్తేరు వీరయ్యలో వేర్ ఈజ్ ది పార్టీ అంటు చిందులేసిన భామ ఊర్వశి రౌటేలా. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ బాలకృష్ణ బాబీ సినిమాలో బాలయ్య తో  కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఊర్వశి మెరవబోతుంది. కొన్ని రోజుల క్రితం కూడా  బాలకృష్ణ కొత్త  సినిమాలో నటించబోయే వారి విషయంలో  రక రకాల హీరోయిన్లు పేర్లు వినపడ్డాయి. వాటిల్లో  ఊర్వశి పేరు కూడా ఉంది. కానీ ఆ వార్త ఒట్టి పుకారు గానే మిగిలిపోయింది. కానీ ఇప్పుడు ఆమె నటించడం కన్ఫార్మ్ అయ్యింది. ఈ విషయాన్ని  ఊర్వశి తన  ఇన్స్టాగ్రామ్ లో కూడా  పోస్ట్ చేసింది.

ఊర్వశి  వాల్తేరు వీరయ్యలో కనపడింది ఒక్క పాటలోనే అయినా కూడా ఆమె ఆ పాటలో  చిరుకి పోటీగా చిందులేసింది. డాన్స్ విషయంలో గాని ఎక్సప్రెషన్ లో గాని సూపర్ గా చేసి  చిరంజీవికే  చెమటలు పట్టించింది. మరి ఇప్పుడు  తొలిసారిగా బాలయ్య సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుందంటే తన నటన ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.  సితార ఎంటర్ టైన్మెంట్స్  నిర్మిస్తున్న ఈ మూవీ బాలయ్యకి 109 వ చిత్రం. ప్రస్తుతం ఈ మూవీ  చిత్రీకరణ దశలో ఉంది.

SOURCE : TELUGU ONE