Home జాతీయ national telgu ఈ అభిమానమే రఘురామ రాజుకు సీటు దూరం చేసింది..!!

ఈ అభిమానమే రఘురామ రాజుకు సీటు దూరం చేసింది..!!

1
0

SOURCE :- ONE INDIANEWS

Andhra Pradesh

oi-Sai Chaitanya

|

Published: Thursday, March 28, 2024, 16:52 [IST]

Google Oneindia TeluguNews

ఏపీలో
ఎన్నికల
పోరు
హోరాహోరీగా
మారుతుంది.
జగన్
ఓటమి
లక్ష్యంగా
బిజెపి,
టిడిపి,
జనసేన
కూటమిగా
పోటీ
చేస్తున్నాయి.
సీట్ల
ఖరారులో
అనూహ్య
ట్విస్టులు
చోటుచేసుకున్నాయి.
కూటమి
ఏర్పాటు
లో
కీలకంగా
వ్యవహరించిన
రఘురామరాజు
సీటు
దక్కలేదు.
దీంతో,
రఘురామ
అసహనానికి
గురయ్యారు.

సమయంలోనే
నరసాపురం
బిజెపి
ఎంపీ
అభ్యర్థి
శ్రీనివాసవర్మ
వీడియో
ను
బిజెపి
శ్రేణులు
వైరల్
చేస్తున్నారు.


నర్సాపురం
సీటు
వెనుక

వైసిపి
ఎంపీగా
గెలిచిన
కొద్ది
నెలలకే
రఘురామరాజు
జగన్
నాయకత్వం
తో
విభేదించారు.
ఢిల్లీ
కేంద్రంగా
దాదాపు
నాలుగేళ్ల
కాలంగా
జగన్
ప్రభుత్వం
పైన
పోరాటం
చేస్తున్నారు.
రఘురామపైన
ఏపీ
ప్రభుత్వం
కేసులు
కూడా
నమోదు
చేసింది.
ఇదే
సమయంలో
ప్రతిపక్షాలకు
రఘురామ
దగ్గరయ్యారు.
ఎన్డీఏ
కూటమిగా
మూడు
పార్టీలు
ఏపీలో
కలవడంలో
తన
వంతు
పాత్ర
పోషించారు.
కొద్దిరోజుల
క్రితం
వైసీపీకి
రాజీనామా
చేసిన
రఘురామ

ఎన్నికల్లో
నరసాపురం
నుంచి
ఎంపీగా
పోటీ
చేయాలని
భావించారు.
పొత్తు
చర్చల్లో
భాగంగా
నరసాపురం
బిజెపికి
కేటాయించారు.
దీంతో
రఘురామ
బిజెపి
నుంచి
పోటీ
చేస్తారని
చర్చ
జరిగింది.
కానీ,
అనూహ్యంగా
రఘురామకు
సీటు
దక్కలేదు.

BJP Narsapuram MP Candidate Srinivasa Varma becomes emotional after ticket announcement video goes viral


శ్రీనివాసవర్మ
భావోద్వేగం

దీనికి
బిజెపి
నేతలు
పలు
కారణాలను
విశ్లేషించారు.
కానీ
రఘురామ
మాత్రం
తనకు
నరసాపురం
నుంచి
ఎంపీ
సీటు
ఇప్పించాల్సిన
బాధ్యత
చంద్రబాబు
పైనే
ఉందని
తేల్చి
చెప్పారు.
నరసాపురం
నుంచి
బిజెపిలో
సుదీర్ఘ
కాలంగా
పనిచేస్తున్న
పార్టీ
నేత
భూపతిరాజు
శ్రీనివాస
వర్మకు
బిజెపి
సీటు
కేటాయించింది.
దాదాపుగా
30
ఏళ్లుగా
శ్రీనివాస
వర్మ
బిజెపిలో
పనిచేస్తున్నారు.
ఆయనను
కాదని
ఇంకా
పార్టీలో
చేరని
రఘురామకు
సీటు
ఎలా
ఇస్తామని
బిజెపి
నేతలు
ప్రశ్నిస్తున్నారు.
అదే
సమయంలో
పార్టీలో
చేరటం
అనేది
సమస్య
కాదని
రఘురామ
వాదన.
అయితే
ఇప్పటికే
సీటు
ఖరారు
కావడంతో
ఇక
రఘురామ
ఎన్నికల్లో
పోటీ
చేయటం
పైన
ఇంకా
స్పష్టత
రావాల్సి
ఉంది.


పార్టీలో
30
సంవత్సరాలుగా

ఇదే
సమయంలో
బిజెపి
నరసాపురం
అభ్యర్థి
భూపతి
రాజు
శ్రీనివాస్
వర్మ
భావోద్వేగానికి
గురైన
వీడియో
బిజెపి
శ్రేణుల్లో
వైరల్
అవుతుంది.
తనకు
టిక్కెట్
దక్కినందుకు
శ్రీనివాస్
వర్మ
ఎమోషనల్
అయ్యారు.
మూడు
దశాబ్దాల
కష్టానికి
గుర్తింపు
దక్కిందని
ఉద్వేగానికి
లోనయ్యారు.
బిజెపి
కార్యాలయం
వద్ద
ఉన్న
కమలం
గుర్తుపై
పడుకుని
ప్రణామం
చేశారు.
కమలం
గుర్తుపై
పడి
కాసేపు
అలాగే
ఉండిపోయారు.

తర్వాత
అభిమానులు
కార్యకర్తలు
ఆయనను
బలవంతంగా
లేపాల్సి
వచ్చింది.
పార్టీ
పైన
ఆయనకున్న
కమిట్మెంట్
చూసిన
కార్యకర్తలు
పార్టీకి
శ్రీనివాస్
వర్మకు
మద్దతుగా
నినాదాలు
చేశారు.
మూడు
దశాబ్దాల
కాలంగా
పార్టీని
నమ్ముకున్నందుకే
శ్రీనివాస్
వర్మ
కు
సీటు
దక్కిందని
బిజెపి
నేతలు

వీడియో
ద్వారా
వివరిస్తున్నారు.

English summary

AP Politics, cm jagan decisions, chandra babu updates, ys jagan election campaign, chandra babu prajagalam, narasapuarm bjp candidate srinivasa varma, ragu rama raju to contest as independent, tdp janasena alliance

Story first published: Thursday, March 28, 2024, 16:52 [IST]

SOURCE :- ONE INDIA