SOURCE :- BBC NEWS
Copyright: Getty Images
దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీలో భారత్ ఫైనల్కు దూసుకెళ్లింది.
బెనోనిలో మంగళవారం జరిగిన సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాను భారత్ రెండు వికెట్ల తేడాతో ఓడించింది.
దక్షిణాఫ్రికా నిర్దేశించిన 245 పరుగుల లక్ష్యాన్ని ఇండియా ఎనిమిది వికెట్లు కోల్పోయి ఛేదించింది.
భారత జట్టులో సచిన్ ధస్ 96 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. కెప్టెన్ ఉదయ్ సహరన్ 81 పరుగులు చేశాడు.
ఐదో వికెట్కు వీరిద్దరూ 171 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
32 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి భారత్ పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు, ఈ జంట అద్భుతంగా రాణించి, జట్టును గట్టెక్కించింది.
అంతకుముందు నిర్ణీత 50 ఓవర్లలో దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది.
దక్షిణాఫ్రికా జట్టులో జువాన్ డి ప్రిటోరియస్ 76 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.
Copyright: Getty Images
SOURCE : BBC NEWS