Home జాతీయ national telgu ఈఫిల్ టవర్‌ కంటే ఎత్తైన బ్రిడ్జ్‌పై వందేభారత్ రైలు పరుగులు

ఈఫిల్ టవర్‌ కంటే ఎత్తైన బ్రిడ్జ్‌పై వందేభారత్ రైలు పరుగులు

5
0

SOURCE :- BBC NEWS

ఈఫిల్ టవర్‌ కంటే ఎత్తైన బ్రిడ్జ్‌పై వందేభారత్ రైలు పరుగులు

3 గంటలు క్రితం

జమ్ముకశ్మీర్‌లో చినాబ్ నదిపై నిర్మించిన రైల్వే ఆర్చ్ బ్రిడ్జి చినాబ్ వంతెనను ప్రధాని మోదీ శుక్రవారం ప్రారంభించారు. కట్‌ఢా నుంచి కశ్మీర్‌కు వెళ్లే… వందే భారత్ రైలుకు జెండా ఊపి ఈ బ్రిడ్జిని అందుబాటులోకి తెచ్చారు.

ఇది ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్. నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తులో దీనిని నిర్మించారు. ఈఫిల్ టవర్ కంటే దీని ఎత్తు 35 మీటర్లు ఎక్కువ.

ఈ వంతెన పొడవు 1,315 మీటర్లు. 1,486 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ బ్రిడ్జి.. కఠినమైన వాతావరణ పరిస్థితులను తట్టుకోగలదు.

గరిష్ఠంగా గంటకు 260 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను కూడా తట్టుకోగలదు. మైనస్ 10 డిగ్రీల సెల్సియస్ నుంచి 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలను తట్టుకునే ఉక్కును దీని నిర్మాణానికి ఉపయోగించారు.

దీని జీవిత కాలం దాదాపు 120 ఏళ్లని ఇంజినీర్లు చెబుతున్నారు.

జమ్ము, కశ్మీర్‌ల మధ్య కనెక్టివిటీని పెంచడంలో ఈ బ్రిడ్జ్ కీలక పాత్ర పోషిస్తుంది.

వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ద్వారా కట్‌ఢా నుంచి శ్రీనగర్ కు వెళ్లడానికి ప్రస్తుతం పట్టే సమయాన్ని ఈ వంతెన 2 నుంచి 3 గంటల వరకు తగ్గిస్తుంది.

చినాబ్ బ్రిడ్డిపై రైలు

ఫొటో సోర్స్, PTI

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)